

ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్లో ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్లోని మరో నగరం ఖజ్విన్లో కూడా భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ దాడులకు బాధ్యులు ఎవరో స్పష్టత లేకపోయినా, టెహ్రాన్ మరియు ఖజ్విన్ నగరాల్లో పేలుళ్లు జరగవచ్చని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కూడా వేలాది మంది పౌరులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే నాశనం అయిందని, వైమానిక దళం కూడా బలహీనపడిందని, క్షిపణులు మరియు డ్రోన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన జీ7 నేతల వర్చువల్ సమావేశంలో కూడా ఇరాన్ త్వరలో లొంగిపోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!