
న్యూస్

'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమా ఓటీటీ విడుదలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించి, పార్ట్ 1 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.
మొదట మే మధ్యలో ఓటీటీకి వస్తుందని వార్తలు వచ్చినా, ఆ ప్లాన్లో మార్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జియో హాట్స్టార్లో వచ్చే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత డేట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. పార్ట్ 1 నెట్ఫ్లిక్స్లో విడుదల కాగా, ధురంధర్ 2 డిజిటల్ హక్కులు జియోహాట్స్టార్ దక్కించుకుంది. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ ఒప్పందంగా ఇది నిలిచింది.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!