

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదికలుగా మారాలని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని సంరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా రూ.64 కోట్లతో నిర్మించిన ఏఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్ సెంటర్ను ప్రారంభించి, మరో రూ.112 కోట్ల విలువైన 9 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్లపై దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. విశాఖను గ్లోబల్ సిటీగా అభివర్ణిస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో టాప్-5లో, ప్రపంచంలో టాప్-100లో నిలవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో కార్పస్ ఫండ్ను బలోపేతం చేసి, రాబోయే కాలంలో ఏయూ మరిన్ని చరిత్రలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!