

అమెరికాలో టారిఫ్ రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రిఫండ్ అమలు జరుగుతుండగా, ఇది ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్గా నిలుస్తోంది. మాజీ అధ్యక్షుడు విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, వాటిని తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ నిర్ణయంతో భారీ మొత్తంలో నిధులు దిగుమతిదారులకు తిరిగి అందనున్నాయి.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ప్రత్యేక ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 5.3 కోట్ల సరఫరాలకు సంబంధించి 3.3 లక్షల మందికి పైగా దిగుమతిదారులు మొత్తం 166 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లకు పైగా) టారిఫ్ రూపంలో చెల్లించారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో సంస్థలు నమోదు పూర్తి చేసుకోగా, అర్హత సాధించిన వారికి 60 నుంచి 90 రోజుల్లో వడ్డీతో సహా రిఫండ్ లభించే అవకాశం ఉంది.
అయితే ఈ రిఫండ్ మొత్తాన్ని వినియోగదారులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గతంలో అధిక ధరల రూపంలో ఈ భారం వినియోగదారులపై పడినప్పటికీ, ఇప్పుడు కంపెనీలు స్వచ్ఛందంగా రిఫండ్ ఇవ్వాలా లేదా అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పెద్ద సంస్థలు మాత్రం రిఫండ్ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ప్రకటించాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!