

భారత ఉప రాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 27న విశాఖపట్నంలో జరిగిన శతాబ్ది ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, గురువులందరికీ వందనాలు తెలుపుతూ వారి మార్గదర్శకత్వం వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. సి. ఆర్. రెడ్డి దార్శనికత, సర్వేపల్లి రాధాకృష్ణన్ నాయకత్వం విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు.
విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా కాలానుగుణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు బోధనతో పాటు పరిశోధన కేంద్రాలుగా మారాలని, పేటెంట్లు, ప్యూర్ సైన్సెస్పై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం రంగాల్లో అభివృద్ధి చెందుతూ గూగుల్, అదానీ గ్రూప్ వంటి సంస్థల పెట్టుబడులతో గ్లోబల్ హబ్గా మారుతోందన్నారు. సచిన్ టెండూల్కర్ ఉదాహరణగా చూపుతూ ఓపిక, క్రమశిక్షణ విజయానికి మూలమని చెప్పారు. త్వరలోనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచంలో అగ్ర విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!