

తెలంగాణ పోలీసు సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్న పోలీసులు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ చర్య ద్వారా పోలీసుల మానసిక ఉల్లాసం పెంపొందించడం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడం లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా సంబంధిత అధికారులు ముందస్తు దరఖాస్తు మరియు సరైన ఆధారాల ఆధారంగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు సిబ్బందిలో ఆనందాన్ని కలిగించింది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది ముఖ్యమైన సంక్షేమ చర్యగా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!