

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని అధికారులను ఆదేశించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణ విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని నిర్ణయించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు.
న్యాయ నిపుణులు ప్రస్తుతానికి ఈ అంశంపై ఏ కోర్టులోనూ కేసులు పెండింగ్లో లేవని, అందువల్ల సీబీఐ విచారణకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. అలాగే హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పు పట్టలేదని, అది చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి, సుప్రీంకోర్టు న్యాయ నిపుణుడు అభిషేక్ సింఘ్వీతో చర్చించి తదుపరి చర్యలపై కార్యాచరణ రూపొందించారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!