

ప్రస్తుతం సినిమాల బడ్జెట్లు వేయి కోట్లను తాకుతున్నాయి. దీంతో మన స్టార్ హీరోలు కేవలం ఫిక్స్డ్ పారితోషికాలు తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్ ఈ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన ఒక సినిమాకు కేవలం ఒక రూపాయి అడ్వాన్స్ తీసుకుని లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటారు. నిర్మాతకు నష్టం రాకూడదనేది రజనీ ఉద్దేశం.
ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. తాను తమిళ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న రాకా ప్రాజెక్ట్కి కేవలం ఒక రూపాయి మాత్రమే అడ్వాన్స్ తీసుకుని లాభాల్లో వాటా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ ఈ నిర్ణయం ద్వారా నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. సినిమా హిట్ అయితే ఎక్కువ లాభం, హిట్ కాకపొతే నిర్మాత నష్టపోకుండా తక్కువ తీసుకోవడం జరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ పెరిగిన నేపథ్యంలో ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి వరంగా మారింది.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!