
సినిమాలు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉభయ ఆలయాలకు సంబంధించిన హుండీ లెక్కింపులో గత 33 రోజుల ఆదాయం మొత్తం 4 కోట్ల 83 లక్షల 22 వేల 554 రూపాయలుగా నమోదైంది. భక్తుల నుండి భారీగా నగదు సమర్పణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా హుండీ ద్వారా 162 గ్రాములు 200 మిల్లీగ్రాముల బంగారం, 4 కిలోలు 180 గ్రాముల వెండి, అలాగే వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఈ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు మరియు శివ సేవకులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!