
గాసిప్స్

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే విడుదల చేశారు. జనరల్ మరియు వృత్తి కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58 గా నమోదైంది. ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 66.02గా ఉంది. ఇందులో బాలికలు 74.4 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.69 గా నమోదైంది. సెకండ్ ఇయర్లో 5,07,948 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 70.58 గా ఉంది. బాలికలు 78.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత 62.5 శాతంగా నమోదైంది.
మొత్తం ఫలితాల్లో కూడా బాలికలు మెరుగైన ప్రతిభ కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!