
గాసిప్స్

అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తైనట్లు ఆలయ నిర్మాణ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు చేసినట్లు కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. 2020 లో ఆలయ నిర్మాణ బాధ్యతలను అధికారికంగా తమకు అప్పగించినప్పటికీ, అవసరమైన ఏర్పాట్లు ముందుగానే ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. న్యాయపరమైన సమస్యలు వంటి అడ్డంకుల కారణంగా ఒక దశలో పనులు ఆలస్యమైనా, చివరకు నిర్మాణం విజయవంతంగా పూర్తి అయిందన్నారు.
ప్రారంభంలో రామ్ లల్లా విగ్రహాన్ని తాత్కాలికంగా కలపతో చేసిన నిర్మాణంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించి, అక్కడ అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడం రామభక్తుల దీర్ఘకాల కోరిక నెరవేరినట్లుగా భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!