

భారతీయ సంగీత రంగానికి అపార సేవలు అందించిన ప్రముఖ గాయని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోస్లే (92) ముంబైలో ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక మంత్రి అశీష్ షేలార్ అధికారికంగా ధృవీకరించారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు అలసట కారణంగా నిన్న సాయంత్రం ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్చినట్లు మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో వెల్లడించారు.
1933 లో ప్రసిద్ధి చెందిన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, తొమ్మిదేళ్ల వయసులోనే గానప్రస్థానం ప్రారంభించారు. 1943 లో మొదటి సినిమా పాటను పాడిన ఆమె, 1950 ల నాటికి హిందీ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
దశాబ్దాల పాటు అనేక ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేస్తూ, భారతీయ సినీ సంగీతంలో అత్యుత్తమ గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.









.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!