
న్యూస్

మొబైల్ డేటా వినియోగంపై జీబీకి రూ.1 పన్ను విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆదాయం సాధించడం, అలాగే యువతలో పెరుగుతున్న డిజిటల్ అలవాట్లను నియంత్రించడం లక్ష్యంగా ఈ ఆలోచన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటా వినియోగం నమోదైంది. ఈ మేరకు జీబీకి రూ.1 పన్ను అమలు చేస్తే సంవత్సరానికి దాదాపు రూ.22,900 కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రతిపాదన సాధ్యతపై అధ్యయనం చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖకు బాధ్యతలు అప్పగించారు. ఈ అంశంపై పూర్తి నివేదికను 2026 సెప్టెంబర్ నాటికి సమర్పించే అవకాశముంది. అయితే ఈ పన్ను అమలుపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.









.jpeg&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!