
.jpeg&w=3840&q=75)
లోక్సభ సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం గణాంకాలు, దక్షిణాది రాష్ట్రాల వాదనలకు విభిన్నంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ప్రోత్సహించిన జనాభా నియంత్రణ విధానాలను క్రమశిక్షణగా అమలు చేసినందున దక్షిణాదిలో జనాభా వృద్ధి తగ్గిందని, అందుకే 1971 జనాభా నిష్పత్తి ఆధారంగానే సీట్లు కేటాయించాలని దక్షిణాది రాష్ట్రాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం టీఎఫ్ఆర్ తగ్గుదల కేవలం దక్షిణాదిలోనే కాకుండా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నమోదైంది.
2024-25 నివేదిక ప్రకారం 2020లో దేశ సగటు టీఎఫ్ఆర్ 2.0గా ఉండగా, 12 రాష్ట్రాల్లో ఇది అంతకంటే తక్కువగా నమోదైంది. వాటిలో మూడు రాష్ట్రాల్లో 1.4, ఆరు రాష్ట్రాల్లో 1.5గా ఉంది. బిహార్ (3.0), ఉత్తరప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6), రాజస్థాన్, ఝార్ఖండ్ (2.4), ఛత్తీస్గఢ్ (2.2), అస్సాం (2.1) రాష్ట్రాల్లో మాత్రమే 2.1 కంటే ఎక్కువగా ఉంది. గుజరాత్, హరియాణాల్లో 2.0గా నమోదైంది. మిగతా రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ తక్కువగా ఉండటం కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా అమలవుతోందని సూచిస్తోంది.
















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!