

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఘటనలో ప్రధాన నిందితుడు కడియాల చిన్నబాబు, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో భూదందాల్లో పాలుపంచుకున్నాడని, భూములను ఆక్రమించడం, తక్కువ ధరలకు సెటిల్మెంట్లు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ గ్రామీణ ప్రాంతంలో భూదాన్ భూములపై ఫోర్జరీ పత్రాలతో పట్టు సాధించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న యజమానుల భూములను లక్ష్యంగా చేసుకుని ఆక్రమణలకు పాల్పడినట్లు సమాచారం. ఇప్పటికే సర్పవరం పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ హత్య కేసులో సాక్షులను కాకినాడ సిద్ధార్థనగర్లోని ఒక అపార్ట్మెంట్లో బంధించి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫ్లాట్ మాజీ మంత్రి అనుచరుడి వ్యక్తిగత సహాయకుడిదని సమాచారం. కడియాల చిన్నబాబు, కడియాల సతీశ్, మాగంటి రాంబాబు, ఒక అడ్వొకేట్ ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాంబాబును అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. అడ్వొకేట్కు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో భూఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులు కూడా రాజీతో ముగిసినట్లు తెలుస్తోంది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!