
న్యూస్

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం బాధాకరమని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని, ఎవరూ ఇలాంటి ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీశ్ రావు ఆరోపించారు. ఆర్టీసీ విలీనం సహా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిలో నమ్మకం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించాలని కోరుతూ, కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!