
సినిమాలు

భారత బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ మళ్లీ రింగ్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అమెచ్యూర్ బాక్సింగ్కు గుడ్బై చెప్పిన ఆమె ఇప్పుడు ప్రొఫెషనల్ బాక్సింగ్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వయోపరిమితి వల్ల అమెచ్యూర్ బాక్సింగ్లో ఆడే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. వయసు పెరిగినా తనలోని శక్తి ఇంకా తగ్గలేదని నిరూపించాలని ఆమె భావిస్తోంది.
మేరీ కోమ్ మహిళా బాక్సింగ్లో గొప్ప ప్లేయర్గా పేరు సంపాదించింది. ఆమె ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచింది. ఆసియా గేమ్స్లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులోనూ మరోసారి రింగ్లో రాణించాలని సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!