
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై చర్చ జరిగింది. 2027 జూన్లో జరిగే పుష్కరాల కోసం చేయాల్సిన పనులను అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
పుష్కరాల కోసం సరైన ప్రదేశాలు గుర్తించేందుకు ఇంజనీర్ల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ 15–20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలిపారు. అలాగే పనులను ప్రాధాన్యతల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ప్రజా భవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరచాలని చెప్పారు. రోడ్లు, ఘాట్లు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!