

ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) తమిళనాడు ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ పార్టీ కార్యాలయంలో ఈ ప్రకటన చేశారు. ఇందులో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని, మళ్లీ గెలిస్తే మరిన్ని పథకాలను పెంచుతామని స్టాలిన్ చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, మహిళలకు నెలసరి సాయం రూ.2,000కు పెంపు, వృద్ధులకు పెన్షన్ రూ.2,000 ఇవ్వాలని తెలిపారు.
అలాగే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు పెంచడం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఆరోగ్య బీమా పథకాన్ని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, రైతులకు మీటర్లు లేకుండా పంప్ సెట్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ సేవలను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్త టైడల్ పార్కులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!