

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పలాంటిర్ టెక్నాలజీస్ సీఈఓ అలెక్స్ కార్ప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని వర్గాల వారికి పెద్దగా భయం అవసరం లేదని చెప్పారు.
వృత్తి ఆధారిత నైపుణ్యాలు ఉన్నవారు—మెకానిక్లు, ఎలక్ట్రిషన్లు, టెక్నీషియన్లు—ఏఐ వల్ల పూర్తిగా భర్తీ కావడం కష్టం అని తెలిపారు. అలాగే భిన్నంగా ఆలోచించే, సృజనాత్మకంగా సమస్యలు పరిష్కరించే న్యూరోడైవర్జెంట్ వ్యక్తులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
సాధారణ కోడింగ్, లా వర్క్, రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేయగలదని హెచ్చరించారు. అందుకే ఈ రంగాల్లో ఉన్నవారు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సృజనాత్మకత, కొత్త ఆలోచనలు చాలా ముఖ్యం అవుతాయని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!