

ప్రస్తుతం భారతీయ సినిమా నుంచి ప్రపంచ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. మరో పెద్ద సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించగా, ‘రామాయణ’ మాత్రం ఈ విషయంలో కొంత ఆలస్యంగా ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు గ్లోబల్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బృందం అమెరికా మార్కెట్లో ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతోంది.




%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!