

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన తెలిపారు. శాసనమండలి సమావేశం సందర్భంగా పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ కిషన్ రావుతో కలిసి భట్టి విక్రమార్క గ్యాస్, పెట్రోల్ సరఫరాల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంధన పంపిణీ వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని చెప్పారు. కొందరు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి పెట్రోల్ లేదా గ్యాస్ నిల్వ చేయకుండా ఉండాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు తరచూ ప్రెస్ మీట్లు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్లో ఇంధనం విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంధన సరఫరా సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జన్నార్, సుధీర్ బాబు, అలాగే ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!