
న్యూస్

మలయాళ నటుడు టొవినో థామస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “పళ్లిచట్టంబి” టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. కయదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 10 న ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
టీజర్ పురాతన చర్చి నేపథ్యంతో ప్రారంభమై, అమాయక ప్రజలను హింసించే దుష్ట శక్తుల కథను చూపిస్తుంది. ఒక శక్తివంతమైన సంభాషణ కథలోని ప్రధాన ఘర్షణను తెలియజేస్తూ ఆసక్తిని పెంచుతుంది. దేవాలయాన్ని, ప్రజలను కాపాడేందుకు కథానాయకుడు చేసే పోరాటం ప్రధానంగా నిలుస్తుంది. 1950, 1960 దశకాల నేపథ్యంతో సాగే ఈ కాలపరిమితి కథలో టొవినో థామస్ కొత్త రూపంలో కనిపించి ఆకట్టుకుంటున్నారు.














.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!