
క్రీడలు

అరకు ఎంపీ డా. తనూజ వినయ్ న్యూఢిల్లీలో పీటీ ఉష ను కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతానికి చెందిన చిన్నారి అథ్లెట్ కొర్ర జీవనతన్యకు కేరళలోని ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ లో శిక్షణ ఇచ్చేలా అవకాశం ఇవ్వాలని కోరారు. సరైన ట్రైనింగ్, ఆహారం, మార్గదర్శకత్వం ఇస్తే ఆమె పెద్ద అథ్లెట్గా ఎదగగలదని తెలిపారు.
తనూజ వినయ్, పీటీ ఉష క్రీడలకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. దీనిపై స్పందించిన పీటీ ఉష, చిన్నారి ప్రతిభను గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జరిగే అకాడమీ ఎంపిక పరీక్షలకు ఆ చిన్నారిని పంపించాలని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!