

రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. చట్టసభల్లో 50% సీట్లు పెంచే ప్రతిపాదనను ఉత్తరాది-దక్షిణాది వివాదంగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జనాభా పెరుగుదలకి అనుగుణంగా సీట్లు పెరగడం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు ఉపయోగం ఉన్న విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
డీలిమిటేషన్ రాజకీయాల కోసం కాదు, ప్రజల అవసరాలు మరియు జనాభా పెరుగుదల ఆధారంగా జరుగుతుందని లక్ష్మణ్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో రైల్వేలకు రూ.1,100 కోట్లు మాత్రమే ఇచ్చారని, కానీ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రూ.9,000 కోట్లు, తెలంగాణకు రూ.7,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్కు మూడు హైస్పీడ్ రైళ్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు. రాజకీయ కారణాల కోసం కేంద్ర నిర్ణయాలను విమర్శిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!