
న్యూస్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. రజతోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రతినిధులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ఇతర కీలక అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరోవైపు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!