

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు సంబంధించిన సైబర్ వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు. తన కుమార్తెకు ఎదురైన వేధింపుల గురించి అక్షయ్ కుమార్ స్వయంగా అధికారులను సంప్రదించగా, ఆమె ధైర్యంగా కుటుంబ సభ్యులకు విషయం చెప్పడం వల్లే నిందితుడిని గుర్తించి పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు తెలిపారు.
ముంబయిలో నిర్వహించిన ‘సైబర్ అవేర్నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో మాట్లాడిన అక్షయ్ కుమార్, తన కుమార్తె ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో అపరిచితుడి నుంచి అసభ్యకర సందేశాలు వచ్చినట్లు తెలిపారు. న్యూడ్ ఫొటోలు పంపాలని కోరిన ఘటనను బయటపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సైబర్ అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో వారానికి ఒకసారి సైబర్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
.png&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!