

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదిలో 1.5 కోట్లకు పైగా నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అలాగే కోట్లాది అనుమానాస్పద ఫేక్ రివ్యూలను గుర్తించి నిలిపివేసినట్లు తెలిపింది. ఈ వివరాలను కంపెనీ తన మొదటి “ట్రస్ట్వర్తీ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ రిపోర్ట్”లో పేర్కొంది.
రిటైల్ రంగంలో వ్యవస్థీకృత మోసాలు, సైబర్ క్రైమ్, ఉత్పత్తుల భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు అధునాతన కృత్రిమ మేధ (AI), మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నట్లు అమెజాన్ వివరించింది. ఫేక్ రివ్యూలు, స్కామ్లను ప్రోత్సహిస్తున్న 100కి పైగా వెబ్సైట్లను చట్టపరమైన చర్యల ద్వారా మూసివేసినట్లు తెలిపింది.
2020లో ప్రారంభించిన తమ కౌంటర్ఫీట్ క్రైమ్ యూనిట్ ద్వారా ఇప్పటివరకు 14 దేశాల్లో చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసుల ద్వారా 32,000 మందికి పైగా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!