

అశోక్ రెడ్డి వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ట్యాంకర్ బుకింగ్, సరఫరా వ్యవస్థపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, గత ఏడాదితో పోలిస్తే మొత్తం డిమాండ్ పెద్దగా పెరగకపోయినా మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్పేట్, నేతాజీ పార్క్ ప్రాంతాల్లో బుకింగ్స్ పెరిగినట్లు తెలిపారు. పెండింగ్ డెలివరీలను రెండు రోజుల్లో తగ్గించాలని, సరఫరా సామర్థ్యాన్ని పెంచాలని, రాత్రి సమయంలో ట్యాంకర్ సరఫరాను విస్తరించాలని అధికారులకు ఆదేశించారు.
నీటి పొదుపు అత్యవసరమని పేర్కొంటూ ప్రతి కుటుంబం కనీసం 20 శాతం నీటిని ఆదా చేయాలని సూచించారు. వాహనాలు కడగడానికి తాగునీటిని వాడకూడదని, బ్రష్ సమయంలో ట్యాప్ మూసివేయాలని, షవర్ వినియోగాన్ని తగ్గించాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో నీటి డిమాండ్ పెరిగే అవకాశమున్నందున ప్రజల సహకారం ఎంతో కీలకమని చెప్పారు. “నీరు అమూల్యమైన వనరు” అని పేర్కొంటూ ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత సాధ్యమవుతుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!