

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల గౌరీ స్ప్రాట్ను తన ప్రియురాలిగా పరిచయం చేసి పలు కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల గురించి భావోద్వేగంగా మాట్లాడాడు.
సాధారణంగా తాను మద్యానికి దూరంగా ఉంటానని అమీర్ తెలిపాడు. అయితే విడాకుల తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. రీనా పిల్లలతో కలిసి వెళ్లిపోయిన తర్వాత తీవ్ర ఒంటరితనాన్ని అనుభవించానని, భావోద్వేగాలను నియంత్రించుకోలేక మద్యం వైపు వెళ్లానని తెలిపాడు. ముందుగా మద్యం తాకని తాను రోజూ రాత్రి ఒక బాటిల్ తాగే స్థితికి చేరుకున్నానని, ఇది దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు కొనసాగిందని గుర్తు చేసుకున్నాడు.
కాగా అమీర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో అమీర్.. దర్శకురాలు కిరణ్రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. అమీర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని గత ఏడాది తన బర్త్డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!