

అమీన్పూర్లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రివరకు సాగి, ఆదివారం ఉదయం మళ్లీ ప్రారంభమైంది. ముకీమ్ సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని దాదాపు 90 శాతం వరకు కూల్చివేశారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా సుమారు 861 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు హైడ్రా చర్యలను అభినందిస్తూ, గతంలో భయంతో జీవించామని, ఇప్పుడు భరోసా కలిగిందని చెబుతున్నారు. ఖాళీ స్థలాలను కాపాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. వందల ఎకరాలను ఆక్రమించి భారీగా లాభాలు పొందిన గుంపులపై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. హైడ్రా చర్యలు ప్రజలకు భరోసా కల్పించాయని స్థానికులు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!