

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 20వ మ్యాచ్లో వాంఖేడే స్టేడియం వేదికగా బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఆరంభంలోనే 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. సాల్ట్ 78 పరుగులు, కోహ్లీ 50 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 34 నాటౌట్తో స్కోరు 240/4కి తీసుకెళ్లారు.
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ గాయం కారణంగా వెనుదిరగగా, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. హార్దిక్ పాండ్యా 40, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. చివరికి ముంబై 222/5తో ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, జస్ప్రీత్ బుమ్రా మంచి బౌలింగ్ చేసినా ఫలితం మారలేదు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!