

ప్రపంచ క్వాంటం డే సందర్భంగా అమరావతి భారత టెక్నాలజీ చరిత్రలో కీలక ఘట్టానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ నెల 14 న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు మేధా టవర్స్లో రెండు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ప్రారంభించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయాలు దేశ టెక్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనున్నాయి.
దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. 1ఎస్, 1 క్యూ పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫెసిలిటీలు క్వాంటం హార్డ్వేర్ పరీక్షలు, సర్టిఫికేషన్కు తోడ్పడనున్నాయి. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం టెస్ట్ బెడ్స్ పరిశోధకులు, విద్యార్థులు, కంపెనీలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ యాక్సెస్ ఫెసిలిటీ క్వాంటం రంగంలో అభివృద్ధికి దోహదం చేయనుంది.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!