
క్రీడలు

ఆశా భోంస్లే మృతి పట్ల ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతగా భారతీయ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన ఆశా భోంస్లే గారి మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె అనేక దశాబ్దాల పాటు సంగీత రంగానికి చేసిన సేవలు అపూర్వమని కొనియాడారు.
అనేక భాషల్లో తన గాత్ర మాధుర్యంతో భారతీయ సంగీతాన్ని సమృద్ధిగా చేసిన ఆశా భోంస్లే గారి కళా వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!