
న్యూస్

పశ్చిమ బెంగాల్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు సమాచారం. భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించకపోయినా, అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం గత ఏడాది నమోదైన 7.66 కోట్ల ఓటర్లలో సుమారు 90.83 లక్షల పేర్లు తొలగించినట్లు తెలుస్తోంది. సందేహాస్పదంగా గుర్తించిన ఓట్లను పరిశీలించిన తర్వాత, గణనీయమైన సంఖ్యలో ఓట్లను తీసివేశారు.
ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. మమతా బెనర్జీ ఈ చర్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మైనారిటీ వర్గాల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని విమర్శించారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరిగిందని చెబుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!