
సినిమాలు

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రాయపూర్కు వెళ్లాల్సిన ఒక విమానం రన్వేపై అకస్మాత్తుగా ఆగిపోవడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో ట్రాఫిక్ జామ్ పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనతో ల్యాండింగ్ కోసం వచ్చిన రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేక్ ఆఫ్ కావాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!