

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే బాంబులు వేస్తామని హెచ్చరించినప్పటికీ, తర్వాత ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కాకుండా, ఇరాన్పై సైనిక దాడులకన్నా ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరుగా యుద్ధానికి దిగకుండా ఆర్థికంగా బలహీనపరచడమే ఆయన లక్ష్యమని చెబుతున్నారు.
హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని మాత్రం ట్రంప్ కొనసాగించడం గమనార్హం. దీని వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రోజుకు సుమారు ₹4,081 కోట్ల నష్టం జరుగుతుందని అంచనా. ఖర్గ్ దీవి చమురు నిల్వ కేంద్రం ఇప్పటికే నిండిపోతుండటంతో ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇది కొనసాగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!