

కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 12 నాటికి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెర్ప్ అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.53 లక్షల మంది వితంతువులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నెలకు ₹4,000 చొప్పున పింఛన్ అందించేందుకు నెలకు సుమారు ₹61 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటి వరకు పింఛన్ పొందని వితంతువుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక స్పౌజ్ కేటగిరీ కింద ఇప్పటికే 2.30 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్య పేరుతో పింఛన్ బదిలీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే లక్షమంది దరఖాస్తు చేసుకోగా, అనర్హులను గుర్తించేందుకు అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. ప్రస్తుతం 28 విభాగాల వారికి పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు అందించాలంటే నెలకు ₹400 కోట్లు, సంవత్సరానికి ₹4,800 కోట్లు వ్యయం కావచ్చని అధికారులు నివేదించారు.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!