
సినిమాలు

వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా ఒంటిమిట్ట కోదండ రామాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు ఆయన నివాసానికి వెళ్లి వేద ఆశీర్వచనం చేయడంతో పాటు శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేశారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తితిదే అధికారులు సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలయ నియమావళి ఉల్లంఘనపై ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!