
గాసిప్స్

నారింజ రంగు, ఆకుపచ్చని ఉదర భాగంతో ఆకర్షణీయంగా కనిపించే అరుదైన పక్షి కవ్వాల్ టైగర్ రిజర్వ్లో దర్శనమిచ్చింది. ఈ పక్షిని ‘ఆరెంజ్ గ్రీన్ పిజియన్’గా పిలుస్తారు. ఈశాన్య భారతదేశం మరియు ఆగ్నేయాసియా ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఈ జాతి తెలంగాణలో కనిపించడం విశేషంగా భావిస్తున్నారు. ఆకర్షణీయమైన రంగులతో ఇది పావుర జాతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.
అటవీ అధికారుల ప్రకారం ఈ పక్షులు ప్రధానంగా పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. ముఖ్యంగా మర్రి, అంజూర వంటి చెట్ల మధ్య సంచరిస్తూ పండ్ల కోసం వెతుకుతాయి. క్షీరదాలకు హానికరమైన విషపూరిత పండ్లను కూడా ఇవి తినగలవు. జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం. రామ్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పక్షులు విత్తనాల వ్యాప్తికి తోడ్పడుతూ అడవి పర్యావరణ సమతౌల్యానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!