

అమెరికా ఇచ్చిన 48 గంటల అల్టిమేటాన్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోనట్టుగా సంకేతాలు ఇస్తోంది. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా హెచ్చరించినప్పటికీ, ఇరాన్ తన వైఖరిలో మార్పు చూపలేదు. తమపై ఒత్తిడి పెంచితే అమెరికాకు ఊహించని విధంగా బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. అలాగే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
తమ ఆస్తులను లేదా ప్రాంతాలను తాకే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, అది నరకపు ద్వారాలు తెరచినట్టే అవుతుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది.
ఇక హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 6 తో ముగియనున్న గడువు కీలకంగా మారింది. ఇరాన్ ప్రకటించిన బిగ్ సర్ప్రైజ్ ఏమిటన్న దానిపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!