

అక్కినేని అఖిల్ వరుస ప్లాపులు ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈసారి పక్కా మాస్ హిట్ కొట్టాలని కంకణం కట్టుకుని ‘లెనిన్’ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. తాజాగా అఖిల్ – భాగ్యశ్రీ బోర్సే పై తీసిన ఓ సీక్వెన్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఆ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయినా, ఔట్పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో దానిని మళ్లీ భారీ స్థాయిలో రీషూట్ చేయనున్నారు. ఈ సినిమాలో అఖిల్ పాత్రకు దృష్టి లోపం ఉంటుందని, ఆ నేపథ్యంతో కథ ముందుకు సాగుతుందని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఈ పాయింట్కు బలంగా కనెక్ట్ అవుతుందని టాక్. రాయలసీమ, చిత్తూరు ప్రాంతం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!