
రాజకీయాలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రైవేట్ అపార్ట్మెంట్లకు ధీటుగా పార్కులు, వాకింగ్ ట్రాక్లు వంటి మౌలిక సదుపాయాలతో టిడ్కో గృహాలను నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. జీ ప్లస్ మూడు విధానంతో నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. గత 21 నెలల్లో రెండు విడతల్లో కలిపి సుమారు 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించినట్లు వెల్లడించారు.






.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!