

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ - 2 భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సముదాయం నమూనా రూపకల్పనను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టు నిర్మాణం అంటే న్యాయం కోసం ఒక పవిత్ర స్థలం నిర్మించడం వంటిదని అన్నారు. సాధారణ ప్రజలకు కోర్టు చివరి ఆశ్రయమని పేర్కొన్నారు. 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హైకోర్టు సముదాయం దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా కోర్టు మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!