

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రంగా ‘రామాయణ’ రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. అలాగే రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ప్రముఖ సంస్థ డీఎన్ఈజీ నిర్వహిస్తోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాల బడ్జెట్ మొత్తం సుమారు రూ.4000 కోట్లుగా ఉండడం విశేషం. ఇందులో యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!