
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాద మరణాలకు మాత్రమే వర్తించిన బీమా సౌకర్యాన్ని, ఇకపై సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కలగనుంది.
ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం, సహజ మరణం జరిగినా కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా అందుతుంది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా, ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా యథాతథంగా కొనసాగుతుంది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 38 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు లాభపడనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!