
రాజకీయాలు

భారత సైన్యం తన ఆయుధ సంపత్తిలో వందలాది సూసైడ్ డ్రోన్లను చేర్చుకుంది. దీనితో ఆధునిక యుద్ధ సామర్థ్యం మరింత బలపడింది. సూరత్కు చెందిన ఇన్సైడైఫ్పీవీ అనే స్టార్టప్ కంపెనీతో రక్షణశాఖ గత డిసెంబర్లో పది కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కేవలం రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికాజీ డ్రోన్లను సైన్యానికి అందించింది.
ఈ ఆధునిక డ్రోన్లు గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇవి గరిష్ఠంగా రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ పది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. అంతేకాకుండా రెండున్నర కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం వీటికి ఉంది, దీనివల్ల ఖచ్చితమైన దాడులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!