
.jpg&w=3840&q=75)
వేసవి కాలంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉండటంతో చల్లదనం ఇచ్చే ఆహారాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన పదార్థాల్లో జొన్న గంజి ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది. వేడి కాలంలో రోజూ తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జొన్న గంజి తయారు చేయడానికి అర కప్పు జొన్న రవ్వ లేదా జొన్న పిండి, మూడు కప్పుల నీరు, ఒక కప్పు మజ్జిగ, తగినంత ఉప్పు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర అవసరం. ముందుగా జొన్న పిండిని కడిగి పెట్టాలి. తరువాత నీటిని మరిగించి అందులో జొన్న రవ్వ వేసి ముద్దలు పడకుండా కలుపుతూ ఉడికించాలి. అది పలుచగా అయ్యే వరకు మరిగించి చివరలో ఉప్పు కలిపి చల్లారనివ్వాలి.
చల్లారిన గంజిలో మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపితే రుచికరమైన జొన్న గంజి సిద్ధమవుతుంది. దీనిని వేసవిలో తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభించి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సులభంగా ఇంట్లో తయారు చేసుకునే ఈ పానీయం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!