
రాజకీయాలు
.webp&w=3840&q=75)
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారత్ తన మిత్రదేశానికి చేయూతనిచ్చింది. చమురు కొరతతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు అత్యవసరంగా 38 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియం సరఫరా చేసింది. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ సహాయం అందింది. ఇందులో 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ కొలంబో నౌకాశ్రయానికి చేరుకున్నాయి. క్లిష్ట సమయంలో సాయం అందించినందుకు శ్రీలంక భారత్కు కృతజ్ఞతలు తెలిపింది.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!