
రివ్యూస్

హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద “యువ భారత్ రన్ 2026” ఘనంగా నిర్వహించబడింది. యశస్వి మల్కా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని విజయవంతం చేశారు. 5కే, 2కే, 500 మీటర్ల విభాగాలతో పాటు జుంబా, యోగా, మెడిటేషన్, గేమ్స్, ఫుడ్ స్టాల్స్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, నటుడు శర్వానంద్ హాజరై రన్ను ప్రారంభించారు. గవర్నర్ యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించగా, వెంకయ్య నాయుడు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, భారతీయ విలువల ప్రాముఖ్యతను వివరించారు.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!